గ్రామసభలో సర్పంచిపై దాడి గ్రామసభలో సర్పంచిపై చెప్పుతో దాడి చేసిన ఘటన మహబూబాబాద్ మండలం మొట్లతండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రామసభ జరిగింది. ఉపసర్పంచితో పాటు వార్డు సభ్యులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో సభ వాయిదా వేయాలని సర్పంచి సుమన్ అనడంతో గ్రామానికి చెందిన యువకుడు వర్రె మహేష్ గ్రామంలో అభివృద్ధి జరగటం లేదని, పనులు చేయకుండానే నిధులు కాజేశారని ఆరోపిస్తూ సర్పంచితో వాగ్వాదానికి దిగారు. ఈ […]
Read Moreసెల్ఫీ సూసైడ్ అటెంప్ట్ వీడియో కలకలం ఓ కుటుంబంలోని భూమి వివాదంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని సూరాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. సురాపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి అతని భార్య శివలీల గత నెల 29 సోమవారం రోజు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులకు సమాచారం తెలపడంతో హుటాహుటిన […]
Read Moreవడదెబ్బతో విద్యార్థిని మృతి వడదెబ్బ సోకి చికిత్స పొందుతూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు-నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ […]
Read Moreతిరుపతిలో జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లో ముగ్గురు మృతి! తిరుపతి జిల్లా: బాణా సంచా ఫ్యాక్టరీలు, నిల్వ చేసే గోదాముల్లో తగిన భద్రతా చర్యలు పాటించాని అధికారులు చెబుతున్నా.. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా పెలుళ్లు సంభవించి ఎంతోమంది చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలంలో అధిక వేడికి కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధారణంగా బాణాసంచా గోదాముల్లో అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. తాజాగా […]
Read Moreహైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది..? బాధితుల కథనం ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్ […]
Read Moreసర్పంచ్కి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట వృద్ధుడి నిరసన తన ఇంటికి వెళ్లే రహదారిని జేసీబితో మూసి వేసి తాను ఇంటికి, బయటికి వెళ్లే మార్గం లేకుండా చేసి స్థానిక సర్పంచి దౌర్జన్యం చేస్తున్నాడని నిరసిస్తూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనే 75 ఏళ్ల వృద్దుడు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డుతో నిరసనకు దిగాడు. గతంలో గ్రామంలో తన ఇంటికి వెళ్లేందుకు 12 అడుల వెడల్పుతో ఒక రహదారి […]
Read Moreహైదరాబాద్ పబ్ లో పాములు..!! పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు..!! విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు..!! ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు..!! పబ్ లు అంటే ఫుల్ మ్యూజిక్, మద్యం.. ఇలాంటివి చాలా వరకూ వింటూ ఉంటాం. కానీ హైదరాబాద్ లోని ఓ పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు. అరుదైన తొండలు, పాములు చూసి పబ్ […]
Read Moreఅజయ్ నియంత వైఖరి మార్చుకో .!– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…? – గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు – భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు. దళిత యువకుడు అని కూడా […]
Read Moreనిన్న ఢిల్లీలో ఇవాళ అస్సాంలో వరస భూ ప్రకంపనలు సోనిత్పూర్లో ఈరోజు సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8.03 గంటలకు 15 కిలోమీటర్ల లోతుతో భూకంపం సంభవించింది. ఇటీవలే బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు సంభవించగా.. ఇప్పుడు అస్సాంలోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం ఆందోళన […]
Read Moreతల్లిని హత్య చేసిన కూతురు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని కూతురు రోకలి దుడ్డుతో మోది హత్య చేసింది. శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదివారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన భర్త బోజన్న 20సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా వుంటుంది. […]
Read More