కుటుంబాన్ని తగులబెడుతానని బెదిరింపు.. మంత్రిపై కేసు నమోదు హోస్పేట్: ఓ కుటుంబాన్ని మొత్తం కిరోసిన్ పోసి తగులబెడుతానని బెదిరించిన మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్.. ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప అనే వ్యక్తి కుటుంబాన్ని బెదిరించారు. మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని తగులబెడుతా అని హెచ్చరించారు. దాంతో పోలప్ప కుటుంబం మంత్రి ఆనంద్ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలోనే […]
Read Moreకోట్లాది రూపాయలు ఖర్చుచేసి అంగరంగ వైభవంగా పెళ్లి, అంతకు మించి కట్న కానుకలు. కానీ వరుని కట్నదాహానికి అంతు లేకుండా పోయింది. ఇంకా తేవాలని సతాయిస్తూ, డ్రగ్స్ మత్తులో నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్పై బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతికి- సుదీప్కు 2021 లో పెద్దలు […]
Read Moreఒంటరి, వితంతు మహిళలను మాయమాటలతో నమ్మించి నగ్నచిత్రాలు తీసి డబ్బు గుంజుతున్న మహిళతో పాటు నలుగురు ఖతర్నాక్ గ్యాంగ్ను ఆదివారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్చేశారు. మంగళ, రవి, శివకుమార్, శ్రీనివాస్ ఆ ముఠా సభ్యులు. మంగళ, రవి దంపతులు కాగా శివకుమార్, శ్రీనివాస్తో కలిసి ముఠాగా అయ్యారు. ఒంటరి మహిళలను గాలించి మంగళ వారిని పరిచయం చేసుకునేది. మహిళలను కారులో ఎక్కించుకుని నిర్జన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి నగ్నచిత్రాలు వీడియో తీసేవారు. ఇక […]
Read Moreకర్నాటకలో ఒక్కసారిగా ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ […]
Read Moreఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. చామ్రాజ్పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా సోమవారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. “మీరు ఇటీవల పబ్లిక్గా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసమంజసమైనవి. పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలను, హద్దులను అర్థం చేసుకుని, కట్టుబడి ఉండాలని అనుభవజ్ఞులైన కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అసమంజసమైన, స్వచ్ఛంద ప్రకటనలు వివాదాలను సృష్టించడానికి తప్ప […]
Read Moreబెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనము 3-4 తరాలకు సరిపడా […]
Read MoreKarnataka: కర్ణాటకలోని ఉడుపిలో ఘోర ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రోగి, అతడి ఇద్దరు బంధువులతో ప్రయాణిస్తోన్న అంబులెన్స్ అతి వేగంగా వచ్చి టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులోని వారంతా ఆ వేగానికి బయటకు వచ్చి పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ అంబులెన్స్ హారన్ కొడుతూ దూసుకొచ్చినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. […]
Read Moreవాగ్ధానాలు చేసి ఆ తర్వాత ఆ ప్రమాణాలని గాలికి వదిలేస్తుంటారు. అయితే రాజకీయ నాయకులు వాటిని మరచిపోతారేమో కాని ప్రజలు మరచిపోరు. ఓట్ల కోసం అడగడానికి వచ్చినప్పుడు వారి ఆవేశానికి బలవుతుంటారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకారుపై బాధిత కుటుంబానికి చెందిన ఓ మహిళ రూ.2 లక్షల పరిహారం విసిరింది. ఇందుకు సంబంధించినగా మారింది.ఫుల్ సీరియస్.. కర్ణాటకలోని కేరూర్ హింసాకాండలో గాయపడిన వ్యక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇన్ని రోజులు గడిచినా తమను కలవడానికి […]
Read Moreప్రధాని మోదీకి రక్తంతో లెటర్ అందింది.కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో ఉత్తరం రాశారు. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని.. దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిని వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరిగితే నక్సల్స్ చేరుతామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. మొత్తం ఎనిమిది మంది లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ, వారి పేర్లు […]
Read Moreప్రధాని నరేంద్ర మోడీకి రక్తంతో లెటర్ రాశారు. కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఈ లేఖని రాయడం విశేషం. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని […]
Read More