bjp

టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం..

June 6, 2023

టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం.. పరిగి బస్టాండ్​ లో టాయిలెట్ కి వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యమైంది. పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్​ హైదర్​ గూడకు చెందిన యు. రవింద్​ రెడ్డికి రెండు నెలల క్రితం గుల్బర్గా జిల్లా ముదేల్​ మండలం కొనగడ్డ గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహం జరిగింది. హైదర్​ గూడ నుంచి కొనగడ్డకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. పరిగికి రాగానే […]

Read More

ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు…

June 5, 2023

గద్వాల్ జిల్లాలో విషాదం గద్వాలజిల్లా : గద్వాల్ జిల్లాలో సోమవారం విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు. మృతి చెందినవారిలో అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని గుర్తించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటన స్థలి […]

Read More

గ్రామసభలో సర్పంచిపై దాడి

June 2, 2023

గ్రామసభలో సర్పంచిపై దాడి గ్రామసభలో సర్పంచిపై చెప్పుతో దాడి చేసిన ఘటన మహబూబాబాద్‌ మండలం మొట్లతండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రామసభ జరిగింది. ఉపసర్పంచితో పాటు వార్డు సభ్యులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో సభ వాయిదా వేయాలని సర్పంచి సుమన్‌ అనడంతో గ్రామానికి చెందిన యువకుడు వర్రె మహేష్‌ గ్రామంలో అభివృద్ధి జరగటం లేదని, పనులు చేయకుండానే నిధులు కాజేశారని ఆరోపిస్తూ సర్పంచితో వాగ్వాదానికి దిగారు. ఈ […]

Read More

తిరుపతిలో జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లో ముగ్గురు మృతి!

May 31, 2023

తిరుపతిలో జిల్లాలో భారీ పేలుడు.. స్పాట్ లో ముగ్గురు మృతి! తిరుపతి జిల్లా: బాణా సంచా ఫ్యాక్టరీలు, నిల్వ చేసే గోదాముల్లో తగిన భద్రతా చర్యలు పాటించాని అధికారులు చెబుతున్నా.. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా పెలుళ్లు సంభవించి ఎంతోమంది చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాలంలో అధిక వేడికి కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధారణంగా బాణాసంచా గోదాముల్లో అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. తాజాగా […]

Read More

సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య

May 31, 2023

హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది..? బాధితుల కథనం ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్ […]

Read More

సర్పంచ్‌కి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట వృద్ధుడి నిరసన

May 30, 2023

సర్పంచ్‌కి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట వృద్ధుడి నిరసన తన ఇంటికి వెళ్లే రహదారిని జేసీబితో మూసి వేసి తాను ఇంటికి, బయటికి వెళ్లే మార్గం లేకుండా చేసి స్థానిక సర్పంచి దౌర్జన్యం చేస్తున్నాడని నిరసిస్తూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనే 75 ఏళ్ల వృద్దుడు జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డుతో నిరసనకు దిగాడు. గతంలో గ్రామంలో తన ఇంటికి వెళ్లేందుకు 12 అడుల వెడల్పుతో ఒక రహదారి […]

Read More

అజయ్ నియంత వైఖరి మార్చుకో .!

May 29, 2023

అజయ్ నియంత వైఖరి మార్చుకో .!– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…? – గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు – భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు. దళిత యువకుడు అని కూడా […]

Read More

తల్లిని హత్య చేసిన కూతురు

May 28, 2023

తల్లిని హత్య చేసిన కూతురు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని కూతురు రోకలి దుడ్డుతో మోది హత్య చేసింది. శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదివారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన భర్త బోజన్న 20సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా వుంటుంది. […]

Read More

ఫోన్ మాట్లాడి నర్స్ ఆత్మహత్య … ఆసుపత్రిలో వేధింపులే కారణమా…?

May 27, 2023

ఫోన్ మాట్లాడి నర్స్ ఆత్మహత్య … ఆసుపత్రిలో వేధింపులే కారణమా…? ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన సిబ్బంది వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో గల మనోరమ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే గౌతమి(21) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం విధులకు హాజరైన గౌతమి మోపాల్ మండలం ముదక్ పల్లి గ్రామంలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో […]

Read More

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!

May 27, 2023

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇందుకోసం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు. వేడుకల్లో భాగంగా జనంలోకి వెళ్లాలని చేసిన అభివృద్ధిని వారికి వివరించాలని సూచించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మిల్లర్లు, కొనుగోలు సిబ్బంది తాలు పేరుతో తరుగు తీస్తుండగంతో అక్కడక్కడ ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు డబుల్ ఇండ్ల కోసం […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?