
ఒకే రోజు రెండు పరీక్షలు…అయోమయంలో అభ్యర్థులు
హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ అకడమిక్, ఉద్యోగాల కోసం సంబంధించిన పరీక్షల్లో సరైన విధానం అవలంబించడం లేదు.
దీంతో విద్యార్థులు ఎటి పాలు పోలేని స్థితిలో సతమతమవుతున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు.
ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్ష ఉండగా.. మరో వైపు గురుకులలో వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష సైతం ఇదే రోజు ఉండడంతో తాము ఏ పరీక్ష రాయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పక్క ఎల్ఎల్బీ పరీక్ష రాయకపోతే విద్య సంవత్సరం కోల్పోవల్సివస్తుండగా.. మరోప్రక్క గురుకుల పరీక్ష అటెండ్ కాకపోతే ఉద్యోగం కోల్పవల్సిన దుస్థితి ఏర్పడిదంటూ అభ్యర్థులు మీడియా వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు రెండు పరీక్షలు లేకుండా నిర్వహించాలని పలు విద్యార్ధి సంఘాల నాయకులూ, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ముందస్తు దృష్టి ఇటు ప్రభుత్వానికి.. అటు అధికారులకు లేకపోవడంతో ఇద్దరి మధ్య తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు……….