నీ గర్భంలో నాకు ప్రాణం పోసింది ఇందుకేనా?

Spread the love

నీ గర్భంలో నాకు ప్రాణం పోసింది ఇందుకేనా?

పల్నాడు జిల్లా:జులై 23
తల్లిపొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు ఆర్టీసీ బస్టాండ్ బాత్ రూమ్‌లో ప్రత్యక్షమైంది. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. అంతే పురిట్లో పుట్టిన బిడ్డను ఆర్టీసీ బాత్ రూమ్‌ లో వదిలి వెళ్లిపోయింది.

అయితే టాయిలెట్ కోసం వచ్చిన ప్రయాణికులు చిన్నారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని పసికందును రక్షించారు. ఈ అమానుష ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.

కన్నపేగు బంధాన్ని పొత్తిళ్లలోనే తుంచేసుకున్న దారుణ ఘటన వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో వెలుగులోకి వచ్చింది. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కన్న ఓ తల్లి వినుకొండ బస్టాండ్‌లోని ఆర్టీసీ టాయి లెట్‌లో వదిలేసి వెళ్లిపోయింది.

అయితే టాయిలెట్‌లో పసిగుడ్డు ఏడుపును ప్రయాణికులు గుర్తించారు. టాయిలెట్‌లో చిన్నారిని చూసి చలించి పోయిన వారు ఆర్టీసీ సిబ్బంది తోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే చిన్నారి ప్రాణాలతో ఉండటాన్ని గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పసి కందును ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలివెళ్లిన వాళ్లు ఎవరో తెలుసుకునే పనిలోపడ్డారు. తల్లిదండ్రులే ఈ బిడ్డను వదిలిపెట్టారా? లేక వేరొకరి చిన్నారిని ఎత్తుకొచ్చి ఇక్కడ వదిలేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు…

135 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?