హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న రాజధాని బస్సులో చెలరేగిన మంటలు

Spread the love

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న రాజధాని బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌:జులై 07
హైదరాబాద్‌ శివార్లలోని పెద్దంబర్‌పేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన రాజధాని బస్సులో పెద్దంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే మంటలను గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపి, అందులోనుంచి ప్రయాణికులను దించివేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
అయితే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏసీలో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు…

101 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?