
బీఎస్పీ లీడర్పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ఖమ్మం జిల్లా దిబ్బగూడెంలో ఘటన
ఓ భూవివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎస్పీ లీడర్ మడకం ప్రసాద్పై దాడి చేసి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దిబ్బగూడెం సమీపంలో సర్వే నెంబర్ 219/14లో ఐదెకరాల భూమిని బీఆర్ఎస్కు చెందిన సర్పంచ్ నారం రాజశేఖర్ బంధువులు సాగు చేసుకుంటున్నారు.
ఆ భూమి తనదంటూ మల్లయ్యగూడానికి చెందిన సంగం దుర్గారావు, బీఎస్పీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి మడకం ప్రసాద్ మరికొందరు నాగళ్లతో దున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజశేఖర్, అతడి అనుచరులు అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
బీఆర్ఎస్ నేతల దాడిలో బీఎస్పీ నేత మడకం ప్రసాద్ గాయపడ్డారు. తర్వాత కర్రలతో ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి.