భార్యాభర్తల సెల్ఫీ సూసైడ్ అటెంప్ట్ వీడియో కలకలం

Spread the love

సెల్ఫీ సూసైడ్ అటెంప్ట్ వీడియో కలకలం

ఓ కుటుంబంలోని భూమి వివాదంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని సూరాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెల్లోకి వచ్చింది.

సురాపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి అతని భార్య శివలీల గత నెల 29 సోమవారం రోజు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.

గమనించిన చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులకు సమాచారం తెలపడంతో హుటాహుటిన బాధితులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుండి నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుమారుడు సాయి సాగర్‌ను దిశ సంప్రదించగా తమ పాలోళ్లు 15 ఎకరాల భూమిని తమ నుండి లాక్కొని దీనిపై కోర్టులో కేసు వేసి తమను నానా ఇబ్బందులు పెట్టి మా తల్లిదండ్రులకు మానసికంగా హింసింపజేసిపవారే ఆత్మహత్యానికి కారణమైనట్టు తెలిపాడు.

అలాగే దరణిలో మా పేర్లు రాకుండా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా పాలాలు చటారి చంద్రయ్య, చటారి నీరాంజీ, గుంట మీది రామకృష్ణ కుమారుడు చంద్రు, మా చెల్లెలు నాగర్కర్నూల్ చటరి శివలీల, లక్ష్మి, పట్నం రేణుక, ఈ ఆరుగురు మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెట్టి మన ఆత్మహత్యకు మా చావుకు కారణం ఈ 6 మంది అని తెలిపారు.

ఈ 6 మంది మా భూమి గుంజుకొని కోర్టులో కేసు వేసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసి, నా కూతుర్ని పెళ్లి చేయకుండా మా నుండి దూరం చేసి మా పిల్ల మాకు దక్కకుండా పోయిందని మా చావుకు కారణం ఆ 6 గురే అని అందుకోసం మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని,

మా చావుకి కారణమైన ఈ ఆరుగురిని కఠినంగా శిక్షించి మా కుటుంబానికి నా కుమారుడికి న్యాయం చేయాలని బాధితులు ఓ సెల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి రోదిస్తూ తెలిపారు.

2,210 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?