సర్పంచ్ భర్త దారుణ హత్య

Spread the love

ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో సర్పంచ్ భర్త దారుణ హత్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానిక కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.

నర్సాగౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

గత వారం రోజులుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కావాలనే నర్సాగౌడ్‌ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

నర్సాగౌడ్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి ఉదయం వరకు ఇంటికి రాలేదు.

మంగళవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నర్సాగౌడ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఘటనా స్థలానికి కామారెడ్డి డీఎస్పీ సురేష్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ ప్రసాద్‌లు చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1,369 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?