ఆసుపత్రిపై దాడి ఘటనలో కేసు నమోదు

Spread the love

ఆసుపత్రిపై దాడి ఘటనలో మృతుడి బంధువులపై కేసు నమోదు

నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో తమ బంధువు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడాని అద్దాలు ధ్వంసం చేసి,

వైద్యుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ ఎస్.హెచ్.వో విజయ్ బాబు తెలిపారు.

మంగళవారం జీజీహెచ్ లో బాలరాజు అనే పేషంట్ పదిహేను రోజుల క్రితం బిక్నూరు మండలం కామారెడ్డిలో గుర్తు తెలియని వాహనానికి ఢీకొని చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడికి డయాబెటిస్ ఉండటంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచాడు.

దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు అనాలోచితంగా వైద్య సిబ్బందిపై దాడి చేయగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు సెక్షన్ ఐపీసీ 353, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజె మెడికల్ సర్వీసెస్ ఆక్ట్ కింద వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.

719 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?