ఫ్లై ఓవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

Spread the love

ఫ్లై ఓవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..ఇంతలో!

తన కళ్ల ముందు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని కాపాడి ప్రశంసలు అందుకుంటున్నాడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సతీష్‌.

ఎంతో చాకచక్యంగా ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు సతీష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల ప్రకారం..సతీష్‌ శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఫ్లై ఓవర్‌ అంచున కూర్చుని ఉన్న ఓ వ్యక్తి గురించి తెలిపారు.

ఓ వ్యక్తి ఫ్లై ఓవర్‌ అంచున నిలబడి దూకేస్తానంటూ బెదిరించాడు. వెంటనే కొందరు అక్కడే డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు.

దీంతో సతీష్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దూకుతున్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు.

అయినప్పటికీ కూడా దూకేస్తానని దగ్గరుకు రావద్దని బెదిరించాడు. దాంతో కంగారు పడిన కానిస్టేబుల్‌ తన వద్ద ఉన్న వాకీటాకీ మాట్లాడుతూన్నట్లు నటిస్తూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టాడు.

తన దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. అతనితో మాట్లాడుతూనే పక్కకు లాగేశాడు.

దీంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. సతీష్‌ అక్కడకు రావడానికి ఓ కారు అతను సాయం చేసినట్లు కానిస్టేబుల్ తెలిపాడు.

ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు, ఊరు స్పష్టం గా లేవని సతీష్‌ తెలిపాడు.

అతని సోదరి మాత్రం జార్ఖండ్‌ లో ఉంటుందనే విషయాన్ని మాత్రం సదరు వ్యక్తి తెలిపినట్లు పేర్కొన్నారు.

అతని వయస్సు 37 సంవత్సరాలు ఉంటుందని, అతని పేరు మంగ్రా గా గుర్తించారు.

మేము ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాము కాబట్టి, అతన్ని ఎల్బీ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించామని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. జగన్నాధ్ తెలిపారు.

ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి సాగర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని నిర్మాన స్థలంలో వలస కూలీగా పని చేస్తున్నాడని అన్నారు.

అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు మరియు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.

1,066 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?