ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న రైతులు

Spread the love

ఎమ్మెల్యే హరిప్రియ వాహనాన్ని అడ్డుకున్న రైతులు


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కేంద్రంలో కోదండరామస్వామి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు .

20 రోజులు ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం పోసి అకాల వర్షాలకు హరి గోస పడుతున్నామని తడిసిన ధాన్యం పేరుతో మంచిగా ఉన్న ధాన్యం మార్క్ ఫెడ్ అధికారులు మొక్క జొన్న , వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు సెంటర్లో రైతులను అధికారులు చీత్కారం గురి అవుతున్న మీకు పట్టింపు లేదా..

కొనుగోలు కేంద్రంలో మంచి నీరు కూడా లేదని , నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మీకు ఆత్మీయ సమ్మేళనం ముఖ్యమా రైతుల గోడు పట్టదా అంటూ అక్కడికి వచ్చిన నేతల ముందు ప్రశ్నించారు .

అనంతరం రైతులు ఎమ్మెల్యే ముందు తమ గోడును విన్నవించారు. ఎమ్మెల్యే కు రైతుల డిమాండ్ తో కూడిన వినతి పత్రం అందించారు .

ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేస్తామని , ఆత్మీయ సమ్మేళనం అనంతరం మీ వద్దకు వస్తానని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన విరమించారు .

రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు .

ఈ కార్యక్రమంలో మండల రైతులు చుట్టు పక్కల రైతులు , లక్ష్మి , మల్సూరు . నారాయణ రెడ్డి, పోలవరపు శ్రీను , తదితరులు పాల్గొన్నారు .

5,306 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?