హనుమాన్ మాలధారుడిపై చెప్పుతో దాడి

Spread the love

హనుమాన్ మాలధారుడిపై చెప్పుతో దాడి

నర్సాపూర్ పోలీస్ స్టేషన్ అంజన్న స్వాముల ధర్నా
హనుమాన్ మాలధారుడిపై కళ్యాణి బిర్యానీ హోటల్ యజమాని చెప్పుతో కొట్టిన ఘటన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కళ్యాణి బిర్యాని హోటల్లో సిలిండర్ ఆర్డర్ చేసిన యజమాని కాజా మొయింద్దీన్ కాస్త లేటుగా తీసుకెళ్లిన హనుమాన్ మాల వేసుకున్న లింగం అనే డెలివరీ బాయ్ ని దుర్భాషలాడుతూ… చెప్పుతో కొట్టాడు.

విషయం తోటి హనుమాన్ మాలధారులతో పాటు స్థానిక బీజేపీ నేతలకు తెలియడంతో వారంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

కళ్యాణి బిర్యాని హోటల్ యజమాని కాజా మొయింద్దీన్ పై చర్యలు తీసుకునే వరకు కదిలే ప్రసక్తి లేదని అక్కడే బైఠాయించారు.

దీంతో హనుమాన్ మాలా వేసుకొన్న భక్తులను నర్సాపూర్ ఎస్సై శివ కుమార్ వారిని నెట్టి వేయడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకొంది.

విషయం తెలుసుకున్న హనుమాన్ మాలధారణ భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మరోసారి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

హనుమాన్ మాల వేసుకున్న వ్యక్తిపై చెప్పుతో దాడి చేసిన కాజా మొయింద్దీన్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ డిమాండ్ చేశారు.

దీంతో హోటల్ యజమాని మొయింద్దీన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

1,771 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?