
ఏసీబీ వలలో సౌత్జోన్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
పాతబస్తీ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం రూ.2వేలు లంచం తీసుకుంటున్న సౌత్ జోన్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 8 డిప్యూటీ కమిషనర్ రిచాగుప్తను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రూ. 4 లక్షల సివిల్ కాంట్రాక్ట్ వర్క్ నిధులు మంజూరుకు రూ.2వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు సివిల్ కాంట్రాక్టర్ ఉమర్ ఆలీఖాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఆమె నేరుగా తీసుకోకుండా ఆయనకు మధ్యవర్తిత్వం వహించిన ఆమె అసిస్టెంట్ , కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
వివరాలలోకి వెళితే … హైదరాబాద్కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ ఉమర్ ఆలీఖాన్ రూ.4 లక్షల సివిల్ కాంట్రాక్ట్ వర్క్కు నిధులు మంజూరుకు సౌత్ జోన్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 8 డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న రిచాగుప్త ను ఆశ్రయించాడు.
ఆమె బిల్లులు త్వరగా రావాలంటే కమిషన్ కింద రూ.2వేలు తన అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ సతీష్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు సివిల్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అప్పటి నుంచి ఏసీబీ అధికారులు రెక్కీ నిర్వహిస్తున్నారు. రూ. 2 వేలు తీసుకువచ్చానని బాధితుడు డిప్యూటీ కమిషనర్కు కాల్చేయగా కంప్యూటర్ ఆపరేటర్ సతీష్కు ఇవ్వాలని సూచించింది.
రిచాగుప్త సూచనల మేరకు సతీష్కు రూ.2 వేలు కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.