బైక్ ఎక్కిన యువతిని ఎక్కడెక్కడో టచ్ చేశాడు..

Spread the love

బైక్ ఎక్కిన యువతిని ఎక్కడెక్కడో టచ్ చేశాడు.. పదేపదే వారించినా వినకపోవడంతో..

రాత్రి వేళ రాపిడో బుక్ చేస్తున్నారా!

తస్మాత్ జాగ్రత
కర్ణాటకలోని బెంగుళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది.

రాత్రి వేళ తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్‌ బుక్‌ చేసుకున్న ఓ యువతిని ర్యాపిడో రైడర్‌ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు.​

వేధింపుల నుంచి తప్పించుకోవడానికి నాగెనహళ్లి సమీపంలో ఓ ప్రైవేట్​కాలేజీ సమీపంలో రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై నుంచి యువతి దూకేసింది.
వేగంగా వెళ్తున్న బైక్‌పై నుంచి దూకడం వల్ల ఆమె కాళ్లకు స్పల్ప గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం..ఈ నెల 21న రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు ఇందిరానగర్‌లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసింది. యువతిని పికప్ చేసుకున్న బైకర్.. ఓటీపీ వస్తుందని ఆమె ఫోన్​ లాక్కున్నాడు.

అనంతరం బాధితురాలు వెళ్లాల్సిన ప్రదేశానికి కాకుండా వేరే మార్గంలో స్పీడ్‌గా తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది.

సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు. పైగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు బాధితురాలు గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన యువతి బైక్‌పై నుంచి దూకగా…ప్రైవేట్ కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను రక్షించారు.

ఇది చూసిన ర్యాపిడో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం యువతి.. తన స్నేహితురాలికి కాల్ చేసి ఘటన గురించి చెప్పింది.

స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ర్యాపిడో డ్రైవర్​ దీపక్‌ను అరెస్ట్​ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో అతడు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది

5,752 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?