వైఎస్ షర్మిల కు బెయిల్

Spread the love

BIG BREAKING

వైఎస్ షర్మిల కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

చంచల్ గూడ జైల్లో వైఎస్ షర్మిల గారినీ పరామర్శించిన వైఎస్ విజయమ్మ

వైఎస్ విజయమ్మ గారు

ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణచివేస్తోంది

పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు

షర్మిల ప్రజల కోసం 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసింది

షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు

ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తుంది

గ్రూప్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా.?

షర్మిల సిట్ కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లు?

-. ఆమె క్రిమినలా? టెర్రరిస్టా?

ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది

అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాటం చేసింది

కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చి షర్మిలను మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదు?

ప్రశ్నించే గొంతుకల్ని అరెస్టులు చేయడం న్యాయమేనా?

ఇదేనా ప్రభుత్వ విధానం?

ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు

ప్రజల సమస్యలు చూపిస్తుంటే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా అరెస్ట్ చేయడమేంటి?

ఎంత కాలం అరెస్టులు చేస్తారు.. జైల్లో పెడతారు?

ఇలా అణచి వేస్తూ ప్రజలే ప్రశ్నించే రోజు తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నా

ప్రభుత్వం ప్రతిపక్షాలపై తన తీరు మార్చుకోకపోతే ప్రజలు, నిరుద్యోగులు సరైన సమాధానం చెప్తారు

షర్మిల మళ్లీ బెయిల్ పై విడుదల అవుతుంది.

ప్రజలు, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది

ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా

మీడియా ప్రజల కోసం పని చేయాలి.

మీడియా వాస్తవాలను మాత్రమే చూపించాలని కోరుతున్నాం

1,998 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?