రాహుల్ కు ఎదురుదెబ్బ

Spread the love

రాహుల్ కు ఎదురుదెబ్బ: పరువు నష్టం కేసు తీర్పుపై స్టే పిటిషన్ డిస్మిస్

సురత్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారంనాడు సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. దొంగల అందరి ఇంటి పేరు మోడీ గా ఉందని 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ సూరత్ కోర్టు తీర్పును వెల్లడించింది.


ఈ తీర్పును సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ ఈ ఏడాది ఏప్రిల్ 3న సవాల్ చేశారు. సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని సూరత్ సెషన్స్ కోర్టును అభ్యర్ధించారు. ఈ పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది.ఈ ఏడాది మార్చి 23న సూరత్ కోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్ష ఆధారంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే

6,857 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?