
అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త……
బండరాయితో మోది పరిగేడుతుంటే కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త…..
శేరిలింగంపల్లి : అనుమానంతో కట్టుకున్న భార్యని రాయితో మోది ఆపై అతి కిరాతకంగా కత్తి తో పొడిచి చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చందానగర్ సీఐ క్యాస్త్రో తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబిక(27) నరేందర్ లు నివాసం ఉంటున్నారు.
స్థానికంగా అంబిక శ్వాస బొటిక్ షాపులో పనిచేస్తుంది. శుక్రవారం ఉదయం 11.40 సమయంలో షాప్ లో పనిచేస్తున్న సమయంలో అంబిక వద్దకు తన భర్త నరేందర్ వచ్చి బండరాయితో తలపై మొదాడు.
ఈ క్రమంలో తేరుకున్న అంబిక తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి కత్తితో అతి దారుణంగా మెడపై నరికి హత్య చేశాడు.
భార్యను చంపిన భర్త పోలీసులకు లొంగిపోయాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.