చీమలపాడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు పొంగులేటి మనోధైర్యం

Spread the love

నేనున్నానని …మీకేం కాదని…!

– చీమలపాడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు పొంగులేటి మనోధైర్యం

– అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ

– తక్షణ సాయంగా బాధిత ఐదు కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం

సికే న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ : వారంతా ఖమ్మంజిల్లా లోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామానికి చెందిన వారు… రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన వ్యక్తులు వీరు…. దురదృష్టవశాత్తు బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులయ్యారు….

ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ…. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఐదుగురు క్షతగాత్రులను గురువారం పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

ఈ సమయంలో పొంగులేటిని చూడగానే బాధిత కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు. వారి బాధను చూసిన పొంగులేటి కూడా తీవ్ర కన్నీంటి పర్యంతమయ్యారు. వెంటనే వారందరిని అక్కున చేర్చుకున్నారు.

నేనున్నానని… మీకేం కాదని… భరోసాను ఇస్తూ తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

క్షతగాత్రులంతా వీలైనంత త్వరగా గాయలబారి నుంచి కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థించారు. బాధితులను పరామర్శించిన వారిలో బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

2,572 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?