
ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ సీట్లలో బిఆరెస్ వారిని ఒక్కరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనీయను…
ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, నాలా నష్టపోయిన వందలాది మంది నేతలలో రాజకీయ నిర్ణయం తీసుకుంటా…
ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ సీట్లలో బిఆరెస్ వారిని ఒక్కరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనీయను…
2014, 18 లో వచ్చిన ఒక్క సీటు కూడా మీకు దక్కనీయను…
ఎవరికీ గౌరవం లేదు మీ పార్టీలో, కొద్ది రోజులలో అందరూ బయటకు వస్తారు..
గత వంద రోజులుగా గుర్తుకు రాని సస్పెన్షన్, జూపల్లి ఖమ్మం రాకతో ఎందుకు గుర్తుకు వచ్చింది…
నన్ను రాజకీయ సమాధి చేయాలని చూసింది నిజం కాదా కేసీఆర్…
పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇస్తానన్న రాజ్యసభ టిక్కెట్ ఏమైంది…
నాకొడుకు రిసెప్షన్ కు వచ్చిన ప్రజలను చూసి కళ్ళు కుట్టాయా…
నన్ను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి, ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా మిమ్మల్ని నమ్మే ఉన్నాను ఇప్పటి వరకు…
నే నమ్మిన సిద్ధాంతం కోసం, నన్ను ఆశీర్వదించే ప్రజలకోసం ఎంతవరకైనా పోరాడుతా…
స్థానిక ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు అండగా ఉన్నా… ప్రతి ఒక్కరికీ ఆర్ధిక సహాయం చేశా… చివరకు జిల్లా అధ్యక్షుడు తాతా మధు సొంత ఊరికి కూడా వెన్నుదన్నుగా నిలిచా…
ఎంపీటీసీ జడ్పిటీసీ ఎన్నికలలో నా వారికి భీ ఫామ్ లు ఇవ్వలేదేందుకు…
రాజకీయంగా నన్ను ఇబ్బందులకు గురి చేయవచ్చు… కానీ ప్రజలలో ఉన్న నన్ను ఏమి చేయలేరు…
ఖమ్మం మున్సిపాలిటీ లో నావారికి 5, 6 సీట్లు ఇమ్మన్నా ఇవ్వలేదు…
2014 ముందు రాజకీయ చరిత్ర లేదు, అయినా ప్రజల కష్ఠ సుఖాలలో ప్రజలకు తోడుగా ఉన్నా, ఇది కూడా తప్పనే అంటారా…
సింగరేణి ఎన్నికలలో 32రోజులు కొత్తగూడెం లో ఉండి పని చేసినా, మీరిచ్చిన గౌరవం ఏమిటి…
తండ్రిలా భావించినా, ప్లీనరీకి 2 కోట్లు రూపాయలు ఇచ్చినా దక్కిన గౌరవం ఏమిటి…
మీ మాటలు మేడి పండులే అయ్యాయి…
తెలంగాణ ఉద్యమం లో యోధానుయోధులను ఎలా అగౌరపరిచారో, ఇప్పుడు నాకు అదే జరిగింది…
అందుకే నా ప్రజలకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను…
ఒక్కరో ఇద్దరో వారి పదవుల కోసం నా పై మాట్లాడటం తప్పా, నే మాటలు తప్పుకాదు…
ప్రజలలోకి వెళ్తాను, ప్రజాలలోనే ఉంటాను…
భగవంతుడు తప్పు చేసిన వారి అందరినీ శిక్షిస్తాడు…
ఒకే కుటుంబమనే మీరు ఇప్పటి వరకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు…
కోర్టులు శిక్షలు విధించినా, కోర్కెలేమిటని ముద్దాయిలను అడుగుతారు…
పార్టీల నుండి బయటకు పంపేటప్పుడు కనీసం విజ్ఞత లేదు… ఇప్పుడు మిమ్మల్ని తప్పు పడుతున్నాను…
నీళ్లు నిధులు నియామకాలు లో కల్వకుంట్ల కుటుంబానికి వరదలా వెళ్లాయి… కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయ్యింది..
ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి…