ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి

Spread the love

ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి

ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వికంటించడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో చోటు చేసుకుంది.

హసన్‌పర్తికి చెందిన మీసరకొండ అవినాష్ (12) వరంగల్ మాముమూర్ లోని మహాత్మా జ్యోతిభాపులే గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు.

జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం హసన్‌పర్తిలోని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు శంకర్ వద్దకు తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యుడు జ్వరమని చెప్పి రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు.

ఇంజక్షన్ వేసిన కొద్ది నిముషాలకే బాలుడికి వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు విషయం ఆర్‌ఎంపీకి తెలపడంతో ఎంజీఎంకు తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు.

ఎంజీఎంకు వెళ్లేందుకు ఆర్ ఎంపీనే అంబులెన్స్‌ను సైతం ఏర్పాటు చేశాడు. రాత్రి12గంటల సమయంలో ఎంజీఎంకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మరణించాడు.

ఇంజక్షన్ వికటించడంతో తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గ్రామస్థులు ఆర్‌ఎంపీ ఇంటి వద్దకు వెళ్లగా పరారయ్యాడు.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

4,643 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?