మద్యం మత్తులో వ్యక్తిపై కర్రలతో దాడి..

Spread the love

వ్యక్తిపై కర్రలతో దాడి.. తీవ్ర గాయాలు
చేర్యాల: మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన సూర్మ లింగం పై కర్రలతో నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలోని వీరన్నపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

బాధితుడి కుమారుడు సూర్న ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన సూర్న మల్లేశం, పెద్దింటి ప్రసాద్, జప్రపు భాస్కర్, రొమాల కనకయ్య బుధవారం గత రాత్రి గ్రామంలో ప్రదర్శించిన బలగం సినిమాను చూసి వస్తున్నారు.

అనంతరం గ్రామ పరిధిలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద మద్యం సేవించి నలుగురు పరస్సరం గొడవకు దిగారు. అందులో ఓ వ్యక్తి ఇంటి వద్ద ఉన్న పెద్ద మనిషి సూర్న లింగం వద్దకు వెళ్లి అక్కడ గొడవ పడుతున్నారనే విషయం తెలిపాడు.

దీంతో లింగం ఘటనా స్థలానికి వెళ్లి గొడవ పడుతున్న వారికి సర్దు చెప్తున్న సమయంలో సూర్న మల్లేశం, పెద్దింటి ప్రసాద్, జప్రపు భాస్కర్ లింగం పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో లింగంకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో లింగం పడి ఉండడాన్ని చూసిన మూటకొండూరు సద్గుణచారి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన లింగంను 108 అంబులెన్స్ లో చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లింగం కుమారుడు సూర్న ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల పోలీసులు తెలిపారు.

6,187 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?