
రేవంత్ రెడ్డి, బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతో తనను లాగుతున్నారని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు.
ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుజేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
”ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వం. ఒక దురదృష్టకర ఘటనను చూపి ఉద్యోగాలు ఆపాలని చూస్తున్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం వేర్వేరనే జ్ఞానం కూడా విపక్షాలకు లేదు.
కొంతమంది రాజకీయ నేతల ఉచ్చులో యువత చిక్కుకోకుండా ఉద్యోగాల సన్నద్ధతను కొనసాగించాలి” అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
2,469 Views