పాఠశాల బస్సు చక్రాల కిందపడి విద్యార్థి మృతి

Spread the love

పాఠశాల బస్సు చక్రాల కిందపడి విద్యార్థి మృతి

బస్సుకు తలుపు సరిగా లేకపోవడం, అతివేగం వల్లే ప్రమాదం

భూదాన్‌పోచంపల్లి : రెక్కలుముక్కలు చేసుకొని కుమారుడిని చదివించి ప్రయోజకుడిని చేయాలన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి.

రోజూలాగే పాఠశాలకు వెళ్లిన కుమారుడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడనే వార్త వారికి తీరని వేదన మిగిల్చింది. ప్రమాదవశాత్తు పాఠశాల బస్సు చక్రాల కింద పడి విద్యార్థి మృతిచెందాడు.

ఈ విషాదం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి శివారులో సోమవారం చోటుచేసుకుంది.

ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… భీమనపల్లి పంచాయతీ హైదర్‌పూర్‌ గ్రామానికి చెందిన వడ్డెమోని శ్రీనివాస్‌, రాణి దంపతుల చిన్నకుమారుడు అభిలాష్‌(8) భూదాన్‌పోచంపల్లిలోని లిటిల్‌ఫ్లవర్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.

ఉదయం పాఠశాల బస్సులో బడికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వస్తుండగా భీమనపల్లి శివారులోని చెరువు వద్ద అభిలాష్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు.

పాఠశాల బస్సు తలుపు సరిగా లేకపోవడం, డ్రైవర్‌ వేగంగా బస్సును నడపడంతో ఆ విద్యార్థి కిందపడ్డాడు. అతని పొట్టపై భాగం నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

కుమారుడు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

6,088 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?