భార్యను గొడ్డలితో నరికి.. ఆత్మహత్య చేసుకున్నభర్త

Spread the love

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి.. ఆత్మహత్య చేసుకున్న భర్త
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొడ్డలితో నరికి చంపి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆందోల్ మండలం నాదూలాపూర్‌లో సోమవారం కలకలం రేపింది.

గ్రామానికి చెందిన ముద్దాయి పేట నారాయణ(55), అతని భార్య మల్లమ్మ (50) లు కొడుకు నరసింహులు తో కలిసి బతుకుదెరువు కోసం గచ్చిబౌలి లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అప్పుడప్పుడు స్వగ్రామామైన నాదలాపూర్‌కు వచ్చి వెళ్తుండేవారు. ఆదివారం తన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి భార్యాభర్తలిద్దరూ ఆదివారం ఉదయం గచ్చిబౌలి నుంచి టేక్మాల్ మండలం అచ్చన్న పల్లిలోని జరిగిన వివాహానికి హాజరయ్యారు.

వారికున్న భూమికి సంబంధించిన కౌలు పైసలు తీసుకొని వెళ్దామని ఆదివారం సాయంత్రం వారి స్వగ్రామం నాదులపూర్‌కు చేరుకున్నారు.

రాత్రి నిద్రలో ఉన్న మల్లమ్మ తలపై గొడ్డలితో నరికి చంపేశాడు. అదే ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ నాగరాజు ఎస్సై సామ్యా నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా భార్య భర్తలిద్దరూ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. అచనపల్లిలో జరిగిన వివాహంలో కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కొడుకు నరసింహులు తెలిపారు.

2,304 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?