
ఢిల్లీలో షర్మిళ అరెస్ట్ పార్లమెంట్ స్టేషన్ కు తరలింపు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైయస్ షర్మిల ధర్నా…
కేసీఆర్ కాళేశ్వరం అవినీతి విచారణ జరిపించాలని డిమాండ్
జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు వైయస్ షర్మిల గారి ర్యాలీ
మధ్యలోనే బారీకేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్న పోలీసులు..
పోలీసులు, YSR తెలంగాణ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం..
వైయస్ షర్మిల గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద వైయస్ షర్మిల గారి ప్రెస్ మీట్:
కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం..
2జీ, కోల్ గేట్ స్కాంల కన్నా ఇదే పెద్దది..
రూ.1.20లక్షల కోట్ల ప్రజా ధనం కాళేశ్వరంలో పోశారు..
ఇందులో వేలాది కోట్లు కేసీఆర్ దోచుకున్నారు..
18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 1.5లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు..
పారింది 18లక్షల ఎకరాలు కాదని 1.5లక్షల ఎకరాలే అని అసెంబ్లీలో బీఆర్ఎస్ మంత్రే ఒప్పుకున్నాడు..
ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.1.20లక్షల కోట్లలో దాదాపు రూ.లక్ష కోట్లు కేంద్ర సంస్థలే రుణాలు ఇచ్చాయి..
పవర్ కార్పొరేషన్ రూ.38వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూ.30వేల కోట్లు, పీఎన్ బీ రూ.11వేల కోట్లు, నాబార్డ్, ఇతర సంస్థలు కలిపి రూ.20వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయి.
ఈ సొమ్మంతా దేశ ప్రజలదే.. అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం..
కాళేశ్వరం విఫలమైన ప్రాజెక్టు.. రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేస్తే మూడేండ్లకే మునిగిపోయింది..
దేశంలోని ప్రతి పౌరుడికి కాళేశ్వరం అవినీతిని తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం..
కాళేశ్వరం ప్రాజెక్టులో నిబంధనలన్నీ గాలికి వదిలేశారు..
కాళేశ్వరం ప్రాజెక్టుకు పురుడి పోసింది మహానేత వైయస్ఆర్..
అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుతో ఈ ప్రాజెక్టుకు గతంలోనే శ్రీకారం చుట్టారు..
రూ.38వేల కోట్లతోనే 16లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని వైయస్ఆర్ భావించారు..
కేవలం గ్రావిటీ ద్వారానే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని భావించారు..
కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశారు..
ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారు..
ఎత్తిపోతల అవసరం లేకున్నా పెద్ద పెద్ద మోటార్లతో నీళ్లు తోడారు..
రూ.1600 కోట్లతో కొనుగోలు చేసిన మోటార్లకు రూ.7వేల కోట్ల లెక్కచూపారు..
రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేశారు..
18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు..
దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. ప్రతి ప్యాకేజీలో అవినీతి జరిగింది..
కాళేశ్వరంలో మోటార్లకు అయ్యే కరెంట్ బిల్ ఖర్చే ఏడాదికి రూ.3వేల కోట్లు..
రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పి, అర టీఎంసీ కూడా లిఫ్ట్ చేయడం లేదు..
ఒక్క ఏడాది కూడా సరిగ్గా నీళ్లు ఎత్తిపోయలేదు.. ఇది బోగస్ ప్రాజెక్టు..
కాళేశ్వరం అవినీతిపై ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు..
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు, మెగాకు అమ్ముడుపోయాయి.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారు
అందుకే ఆ పార్టీలు కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నించడం లేదు..
రాష్ట్రంలో కాదు.. దేశంలోనే కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ..