
మీడియాతో మాట్లాడుతున్న సర్పంచ్ నవ్య
కోరికతీర్చమని బీఆర్ఎస్ నేత వేధిస్తున్నడు
ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపణ
ధర్మసాగర్, జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ కు చెందిన ఓ బీఆర్ఎస్ ముఖ్య నేత తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ని ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీరుపెట్టారు. మం డలంలోని ఓ మహిళా నేత, కొందరు ప్రజాప్రతి నిధులు, ముఖ్య నాయకులు సదరు నాయకుడి కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నా రని వాపోయారు.
వారిమాట వినలేదని గ్రామా భివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తు న్నారని, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన చెందారు. తనను వేధిస్తున్నవారికి అక్కా, చెల్లెళ్లు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు, బంగారం అమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్నామని, నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని తెలిపింది.
ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనం అని, రెండు, మూడు వర్గాలు ఉండటంతో అభివృ ద్ధి కుంటుపడిందని చెప్పారు. గత నెలలో మంత్రి కేటీఆర్ వేలేరులో పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజాప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారం టూ ఏడ్చేశారు.