TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్క భారీ ప్రమాదం

Spread the love

బిగ్ బ్రేకింగ్: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్క భారీ ప్రమాదం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం రేవంత్ రెడ్డి కాన్వాయ్క భారీ యాక్సిడెంట్ జరిగింది.

కాన్వాయ్ లోని కార్లు అతివేగంతో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అయితే, కార్లలోనే ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో కాన్వాయ్లోని ఆరు కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. కొంతమంది రిపోర్టర్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ధ్వంసమైన కారు

కాగా రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి కార్లు ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇందులో 4 కార్లు కాన్వాయ్ లోని వాహనాలు కాగా మరో రెండు కార్లు రిపోర్టర్స్ కి సంబంధించినవి. ఇందులో సిరిసిల్ల రిపోర్టర్స్ ఉండగా.. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది.

6,280 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?