
మరో దారుణం.. రెచ్చిపోయిన కోతి.. చిన్నారి వేలు కొరికేసింది..
కుక్కల దాడులే కాదు.. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో కోతుల దాడులూ పెరిగిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.
చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్నాయి. హైదరాబాద్లో పట్టపగలు జరిగిన అత్యంత దారుణఘటన ఇంకా కళ్లముందే తిరుగుతోంది. ఇలాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అలాంటిదే మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం.
కురవి మండలం మోదుగుల గూడెంలో రెండునెలల పాపపై కోతులు దాడి చేశాయి. ఇంటి వరండాలో చిన్నారిని పడుకోబెట్టడంతో.. చుట్టుముట్టిన కోతులు దాడికి దిగాయి. చిన్నారి కాలి బొటన వేలుని బలంగా కొరికాయి.
దీంతో ఆ చిట్టితల్లి అల్లాడిపోయింది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది చిన్నారు. కాలి బొటన వేలు నుంచి రక్తం ధారగా కారడం కనిపించింది. కోతి దాడిలో సగం వేలు కూడా కోల్పోయింది రెండునెలల పాప. శరీరంపై పలుచోట్ల గాయాలు కూడా అయ్యాయి.
దీంతో చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు తల్లిదండ్రులు. చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు వేలికి ట్రీట్మెంట్ చేస్తున్నారు వైద్యులు. మహబూబాబాద్ ఏరియాలో కోతుల బెడద భారీగా ఉంది. పట్టపగలు ఇంటి తలుపు తెరిస్తే చాలు.. వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఇంట్లో నివశిస్తున్న చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడులకు కూడా దిగుతున్నాయి.
ఈ కోతుల బెడదల కోసం అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నామంటున్నారు స్థానికులు. చిన్నపాటి చర్యలు తీసుకోవడమే కాని.. కోతులను అడవులకు వాపస్ పంపే ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదు.
చిన్నారిని కోతులు కరవడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమన చిన్నారులకు బయటకు పంపాలంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. రెండు నెలల పాపకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని డాక్టర్లె తెలిపారు.
ఊయలలో పడుకోబెట్టిన పసికందుపై కోతులు దాడి చేయగా కాలి బొటన వేలుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగులగూడెంలో జరిగింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులకు నెలన్నర పాప ఉంది. లావణ్య మోదుగులగూడెంలోని పుట్టింట్లో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం చిన్నారిని ఇంటి ఆవరణలోని ఊయలలో పడుకోబెట్టి నీళ్ల కోసమని ఇంట్లోకి వెళ్లారు.
అదే సమయంలో కోతులు ఒక్కసారిగా వచ్చి ఊయలలో ఉన్న పాపపై దాడి చేశాయి. పసికందు పెద్దపెట్టున రోదించడంతో లావణ్య పరుగెత్తుకొచ్చారు. కర్రతో వాటిని తరిమివేశారు. అప్పటికే కోతులు చిన్నారి కాలిబొటన వేలు కొరికివేశాయి. వెంటనే పసికందును మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించినట్లు తెలిసింది.