
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గిరిజనులకు మోసం చేయాలని చూడకు………..
జగో బంజారా మరో నంగారా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నునావత్ రాజు…..
తెలంగాణ రాష్ట్రంలో లంబాడి గిరిజనులు కుడు,గుడు మరియు గుడ్డ సరిగ్గా లేక బతుకులు సాగదీస్తున్నారు .ఇతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపి మా బతుకులు ఆగం చేయొద్దు. నేటికీ గిరిజన గూడలో, లంబాడి తండాలలో సరైన విద్య, వైద్య, సదుపాయాలు లేక నానా తిప్పలు పడుతున్నరు. ఇప్పటికీ సరైన రోడ్లు తాగు మరియు సాగు నీరు లేక వలసలు పోతున్నాము.ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజనుల, సంక్షేమం అభివృద్ధి పట్ల దృష్టి సారించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు గిరిజనులను అభివృద్ధి చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం షెడ్యూల్ తెగల జాబితాలో ఇతర కులాలను చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపడాన్ని జగో బంజారా మరో నంగార రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నునావత్ రాజు తీవ్రంగా ఖండిస్తున్నారు .నేటికీ తాండాలలో పసిపిల్లలను పోసించలేక పట్టణాలలో వలసలు, మురికివాడలో నివాసాలు సరియైన సదుపాయాలు లేక రోడ్డుపక్కనే తమ జీవితాలను బ్రతుకు జీవడా అని సాగదీస్తున్నారు.గిరిజనులను అభివృద్ధి చేయకుండా ఇతర కులాల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం ముమ్మాటికి లంబాడి గిరిజనులను మోసం చేయడం అవుతుంది అని,ఏజెన్సీ ఏరియాలలో నివసిస్తున్న గోండు, కోయ ,కోలం ,తోటి ప్రధాన్, కొండ్ల రేడ్లు , కొండా కాపులు నేటికీ అభివృద్ధికి ఆమాడా దూరంలో ఉంటూ వారి గుడాలకు సరియైన రహదారులు లేక విష జ్వరాలతో, పౌష్టికాహారలేమితో బాధపడుతుంటే వారికి కనీస సదుపాయాలైన రోడ్డు సదుపాయాలు,నివసించడాకి గృహాలు ,విద్య ,వైద్యం ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలు అమలు చేయాలని వారిని అభివృద్ధి పథంలో తీసుకురావాలని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవించారు.