కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతలు భేటీ.. భారాసలో చేరేందుకు సుముఖత

Spread the love

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతలు భేటీ.. భారాసలో చేరేందుకు సుముఖత

హైదరాబాద్‌: భారాసలో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారాస అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్‌లో కలిశారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర పథకాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ఇతర కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు.

జాతీయ పార్టీగా భారాస ఆవిర్భావాన్ని నాయకులు ఆహ్వానించారు. దేశంలో ప్రస్తుతం కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం అవసరం ఉందన్నారు.

భారాస విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించిన నాయకులు.. పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

519 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?